కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు వద్ద హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడున్నవారు తెలిపారు. మరొక వాహనాన్ని దాటివెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు లక్ష్మి, గోవర్థిని హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. వారందరిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
కర్నూలులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి…
![7c844551-9dba-4acd-88da-61575d61b678](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/7c844551-9dba-4acd-88da-61575d61b678.jpg?resize=1080%2C618&ssl=1)