ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కృతిక్ శుక్లాను కలిసి సంప్రదించారు. ధర్నాస్థలి దూరం చేసి రెండేళ్లు అయ్యిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి నూరు శాతం అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు.
ఆర్.డి.ఓ. ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేసి ధర్నాస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతి లో కోరారు. తగిన హామీ ఇచ్చి రమణ రాజు దీక్ష విరమింపజేయాలని సూచించారు. ఇందుకు ఆమె సమ్మతిస్తూ ఆర్.డి.ఓ., డి.ఎస్.పి. అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చారు. అనంతరం ఆర్.డి.వో. సురేష్, డి.ఎస్.పి. మురళీ కృష్ణా రెడ్డి దీక్షా స్థలికి చేరుకుని రమణరాజు కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.
ఫిబ్రవరి 5వ తేదీ శనివారం సాయంత్రం 4గంటలకు ఆర్.డి.ఓ. కార్యాలయ మీటింగ్ హాలులో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభ్యంతరాలు స్వీకరించి ఎస్.పి. నివేదిక ద్వారా అందరి ఏకాభిప్రాయంతో కలెక్టర్ సముచిత పునఃనిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు.