కాకినాడ కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు కలర్ ఫుల్ జోష్ గా సాగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి తరలిరావడం జరిగింది. స్దానిక సినిమా రోడ్డు పద్మనాభ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం క్రీస్తు బోధనలు ప్రపంచానికి అందించిన సందేశాన్ని అందించారు. భారీ ఎత్తున కాకినాడ సిటీ, పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంఘస్తులతో కిటకిటలాడింది.
కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించగా ఆధునిక సాంకేతిక హంగులతో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆశక్తి కరంగా సాగాయి. కల్వరి టెంపుల్ ఆంధ్ర ప్రదేశ్ ఇన్ చార్జిలు ఆంధ్రా ఇంఛార్జ్ లు జయరాజ్, అనిల్, స్ధానిక సంఘ కాపరి రెవరెండ్ నాతాన్ లు ఈ కల్వరి టెంపుల్ క్రిస్మస్ వేడుకల నిర్వహణ బాధ్యతులు పర్యవేక్షించారు.