విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని , విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాలకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఎస్.వీ.వీ. సత్యనారాయణరెడ్డి అన్నారు. వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఎర్పడినప్పటినుంచి ఇప్పటివరకు నాడు-నేడు పేరు తో పాఠశాలలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలు ఆభివృద్ది చేశారని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పఠశాలలను అభివృద్ధి చేసి, రెండవ దశలో ప్రభుత్వ ఇంటర్ మీడియట్ విద్యపై దృష్టి సారించారన్నారు.
డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 12 ప్రభుత్వ, 2 ఎయిడెడ్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో 10 కళాశాలలను నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఈ పనులకు రూ.7.10 కోట్లను మంజూరు చేసిందని తెలిపార. ఇందులో భాగంగా రివాల్వింగ్ ఫండ్ కింద అభివృద్ధి పనులకు రూ. 2,51,99,973 విడుదల చేసిందని, మిగలిన డబ్బుతో సెంట్రల్ ప్రొక్యుర్ మెంట్ మెటీరియల్ కింద మౌలిక సదుపాయాలు కల్పించబోతునందన్నారు.