కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పలువురు చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుందని తెలిపారు.