డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని రాజోలులో పొన్నాడ హనుమంతరావు ఆద్వర్యంలో అయన స్వగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమవేశానికి పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత కాంగ్రెస్ పార్టీ లో చేరాని వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా బలంతో మరింత భలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిలాను నియమించడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.