తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్ రెడ్డి రేపు పదవీ బాధ్య తలు స్వీకరించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీలను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏ.ఐ.సీ.సీ. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. వారిని కూడ కలసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకా రానికి రావాల్సిందిగా వారిని కోరారు..