దేశ వ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి సీ.జే.ఐ. డీ.వై. చంద్రచూడ్కు లేఖ రాసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వార్థ ప్రయోజనాల సమూహం న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని మోదీ అన్నారు.
5 దశాబ్దాల క్రితమే వారు నిబద్ధత గల న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుండి నిబద్ధతను సిగ్గు లేకుండా కోరుకుంటారు, కానీ దేశం పట్ల నిబద్ధతకు దూరంగా ఉంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు వాటిని తిరస్కరిస్తున్నారనడంలో ఆశ్చర్యం లేదన్నారు.