రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం సంపాదించుకున్న ముగ్గురు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్సులుగా ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టా శివప్రసాద్, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు మాట్లాడుతూ… చోటు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి తగు చర్యలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు, నగర అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు, ఏఐసీసీ సభ్యుడు మల్లిపూడి రాంబాబు, నియోజవర్గ ఇన్చార్జిలు కోలా ప్రసాద్ వర్మ, మారోతు శివ గణేష్, ఉమ్మిడి వెంకట్రావు, మేడిది శ్రీను, తుమ్మల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయలి…
![WhatsApp Image 2023-10-16 at 5.28.16 PM (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-16-at-5.28.16-PM-1.jpeg?resize=1280%2C602&ssl=1)