ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి 76 ఏళ్ళ ధర్మపురి శ్రీనివాస్ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీనివాస్ గతంలో ఏ.పీ. లో మంత్రిగా, ఎం.పీ. గా, పీ.సీ.సీ. అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎం.పీ. గా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు.