కాకినాడ జిల్లాలోని కాకినాడ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ నెంబర్ ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఆవిష్కరించారు.
ఈ పతాక ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి రాష్ట్ర నలుమూలల నుండి అన్ని జిల్లాల నుండి ఏఐఎస్ఎఫ్ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని, విద్యార్థులు భారీగా పాల్గొని చదువు పోరాడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.