కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏ.సీ.బీ. అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయి నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈ.ఈ. కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలను అడిగారు. దానికి వారు 16 వేల రూపాయలు డిమాండ్ చేయడం చేశారు. దానితో ఆయన సంబందిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. దీంతో వారు దాడులు చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఏడుకొండలు, స్వామిలను పట్టుకుని ఆ నగదును స్వాధీనంచేసుకున్నారు.
కాకినాడలో ఏ.సీ.బీ. దాడి…
![WhatsApp Image 2024-01-23 at 3.07.56 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-23-at-3.07.56-PM.jpeg?resize=1280%2C700&ssl=1)