Trending News

కాకినాడలో ఘనంగా మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి…

WhatsApp Image 2024-02-21 at 2.14.27 PM

సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి సందర్బంగా  ఎం.ఎస్.ఎన్. చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్, ఈ.ఓ. లతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాన్య కుటంబంలో జన్మించి రంగూన్ వెళ్లి కష్టపడి ఆస్తులను సంపాదించారని అన్నారు.

తన యావదాస్తును ప్రతీ పేదవాడికి విద్యను అందించాలనే ఆశయంతో విద్యకు, దేవాలయాలకు దారదత్తం చేసిన మహనీయులని అన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో డిగ్రీ కాలేజ్, వేద పాఠశాల నూతన బిల్డింగ్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. దాత సమకూర్చిన ఆస్తులు అనేకం ఇంకా అన్యాక్రాంతంలో ఉన్నాయని, తన స్వార్థ రాజకీయాల కోసం కులాలను, మతాలలను, జాతులను విమర్శించే ద్వారంపూడికి నాయకర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత లేదని పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్