కాకినాడ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ పైప్ లైన్లు వేయడంలో ఉపయోగపడే ఫైబర్ షీట్లను కాకినాడ జగన్నాధపురం ఏటుమొగా ప్రాంతంలో ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉంచ్చారు. కాని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అంటించేసారు. దానితో దాని చుట్టురూ మంటలు చెలరేగి ప్రమాదానికి దారి తీసింది. స్థానికుల సమాచారంతో సమీప అగ్ని మాపక అధికారులు ఘటనా స్తలానికి వచ్చి చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది ఆకతాయిలు ఫైబర్ మెటీరియల్లను సిగరెట్టు తో అంటించడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
కాకినాడలో చోటు చేసుకున్నఘోర ప్రమాదం…
![WhatsApp Image 2023-12-22 at 1.58.32 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-22-at-1.58.32-PM.jpeg?resize=1080%2C628&ssl=1)