స్మార్ట్ సిటీ అయిన కాకినాడ నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటవుతున్నప్పటికీ నగర పాలక సంస్థ ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. మెయిన్ రోడ్ వీధి మలుపుల్లో క్రాస్ రోడ్లల్లో ఫ్లెక్సీ బోర్డులు కట్టడం వలన రోడ్ డివైడర్స్ వీధి స్థంభాల కు నిలబెట్టి వెడల్పైన స్టాండింగ్ ఫ్లెక్సీ బోర్డ్స్ నిలపడం వలన షాపులు దుకాణాలు కనపడకుండా కరెంటు స్తంభాలకు అడ్డగోలుగా కడుతున్న ఫ్లెక్సీ బోర్డుల వలన తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవు తున్న దుస్థితి వుంద న్నారు. ఈ విష సంస్కృతిని ఇదే విధంగా కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ప్రస్తుత పాలనకు పెద్ద తేడా ఏమీ ఉండదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు పేర్కొన్నారు.