రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలను చైతన్య పరచటం, రానున్న ఎన్నికల్లో బీ.జే.పీ. కి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం లక్ష్యాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజా పోరు యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కాకినాడ నగరంలో కొనసాగుతుందని బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కన్వీనర్ గా బిళ్ళకుర్తి రామేశ్వర్ రెడ్డి, నగర కన్వీనర్ గా మొసలిగంటి సురేష్ వ్యవహరిస్తారని చిలుకూరి చెప్పారు. గట్టి సత్యనారాయణ కాకినాడ నగరంలో 50 వార్డుల్లోనూ రధం ద్వారా తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారని ఆయన చెప్పారు.
కాకినాడలో ప్రజా పోరు యాత్ర ప్రారంభం…
![WhatsApp Image 2024-02-21 at 1.28.38 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-1.28.38-PM.jpeg?resize=899%2C700&ssl=1)