తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచందర్రావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు.
పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటు ముందుకు వెళ్తున్నారని, నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ గారి పోరాట స్ఫూర్తి ఒక దిక్చూచిగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, తదితులున్నారు.