కిడ్నాప్ అయిన విద్యార్థి దుర్గా నాని రాత్రి 7 గంటల ప్రాంతంలో కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. విద్యార్థి కిడ్నాప్ ఉదాంతంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తం కావడంతో కిడ్నాపర్లు విద్యార్ధిని కాకినాడ జే.ఎన్.టీ.యూ. వద్ద వదిలిపెట్టారు. అంతటితో ఆగక విద్యార్థి దుర్గా నాని ని సామర్లకోట మఠం సెంటర్లో దింపాలని “ర్యాపిడో” సంస్థకు చెందిన టూవీలర్ డ్రాపింగ్ ఒక ద్విచక్ర వాహనాన్ని మాట్లాడి అతనికి డబ్బులు చెల్లించి జే.ఎన్.టీ.యూ. వద్దకు పంపించారు. దానితో రాపిడో సంస్థ ప్రతినిధి బాలుని మోటార్ సైకిల్ ఎక్కించుకొని మఠం సెంటర్లో కాక విద్యార్థి చిరునామాలు తెలుసుకొని బలిసులు పేటలోని ఆయన కుటుంబం వద్దకు తీసుకువచ్చి అప్పగించాడు.
ఈ విషయాన్ని బాలుని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయగా పెద్దాపురం డిఎస్పి లతా కుమారి స్థానిక స్టేషన్కు విచ్చేసి విద్యార్ది నుండి కిడ్నాపర్ల వివరాలను సేకరించారు. అయితే ర్యాపిడో ప్రతినిధికి వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించే చర్యలు చేపడుతున్నట్లు డిఎస్పి చెప్పారు. అలాగే కాకినాడలోని కోకిల రెస్టారెంట్లో విద్యార్థి దుర్గానానికి భోజనం తీసుకున్న ట్టు తెలియడంతో కోకిల రెస్టారెంట్ వద్ద సిసి ఫుటేజ్ ఆధారంగా ఆగంతకులను గుర్తించే చర్యలు ముమ్మరం చేస్తున్నట్టు ఆమె చెప్పారు.