Political

కాకినాడలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం…

WhatsApp Image 2024-02-17 at 8.38.21 PM

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశాన్ని సభాధ్యక్షులు కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి పండూరి జయకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వీరమల్ల వీరబాబు, కోనసీమ జిల్లా కన్వీనర్ టి జయేంద్ర ప్రసాద్, తదితరులు విచ్చేసారు.

ఈ సందర్బంగా నరసింహ చారి మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి తమకూ రాజకీయ అభివృద్ధి కల్పించాలని కోరారు. విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయే అని ఆయన అన్నారు. రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ… విశ్వబ్రాహ్మణులకు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాలు కల్పిస్తారని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.