కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మారై యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ప్రారంభించగా, ఎం.పీ. వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… ప్రభుత్వం వైద్యమును పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మారై యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఆర్. విజయ్ కుమార్, ముఖ్య విభాగ వైద్యులు ఎం.పి.ఆర్. విఠల్, అనురాధ, కోదండగిరి, వెంకటరెడ్డి, యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కాకినాడ ఆసుపత్రిలో ఎమ్మారై ప్రారంభం …
![WhatsApp Image 2023-11-02 at 10.00.15 PM (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-02-at-10.00.15-PM-1.jpeg?resize=994%2C532&ssl=1)