కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంట పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ అశోక్ నగర్లో ఉన్న ఉదయ్ ఇంటి దగ్గర జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్ శ్రీనివాస్ను అభినందించి పుష్ప గుచ్చాలిచ్చి శాలువాలతో సత్కరించారు. కాకినాడ పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… నామీద పెట్టుకున్న నమ్మకంతో జనసేనాని కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారని ఆయన నమ్మకాన్ని నిలబెటతాన్ని అన్నారు. ఈ నెలాఖరులో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి పర్యటన కాకినాడ జిల్లాలో ఉంటుందని తెలిపారు. అనంతరం పలువురు జనసేన నాయకులు ఉదయ్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి ఉదయ్ ఇంట సందడి…
![WhatsApp Image 2024-03-23 at 2.25.11 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-23-at-2.25.11-PM.jpeg?resize=970%2C417&ssl=1)