కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ గా జె. వెంకటరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం కొండయ్య పాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమీషనర్ గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న నాగనరసింహారావు నుండి ఛార్జ్ తీసుకుని నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సంబందిత అధికారులు ఆయనకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జె.వెంకటరావు ఇప్పటి వరకు పార్వతి పురం మన్యం జిల్లా లో రెవెన్యూ డివిజన్ అధికారిగా పని చేస్తూ బదిలీ పై కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా వచ్చారు.
కాకినాడ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జె. వెంకటరావు…
![WhatsApp Image 2024-02-02 at 7.09.20 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-7.09.20-PM.jpeg?resize=720%2C361&ssl=1)