గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పుటేరు ధర్నాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేయాలని ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు అన్నారు. ఇందుకు సంబందించి జిల్లా కలెక్టర్, ఎస్.పి. సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అంబేడ్కర్ సెంటర్ ఉప్పుటేరు పార్కు వద్ద జాతీయ జెండాతో నిరాహారదీక్ష చేపట్టారు. ధర్నాస్థలి పై జిల్లా అధికార యంత్రాంగం స్పందించే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఇక్కడ దీక్ష కొనసాగించడం అభద్రతకు పరాకాష్టగా వున్న విషయం ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రహించి ముఖ్య మంత్రికి తెలియ జేయాలన్నారు.