కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని ఆర్.టీ.సీ. కాంప్లెక్స్లో ఒక ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కాంప్లెక్స్లో బస్సును తిప్పుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి ప్రవేశం లేదని అయినా ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.