కాకినాడ జిల్లాలో దొంగలించబడిన 236 సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
దొంగలించబడిన సెల్ఫోన్ లను రికవరీ చేసి వాటి యజమానులకు అందించడం ఇది మూడోసారి అని ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 236 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు, సిబ్బంది రికవరీ చేసినట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ వివరించారు.