కాకినాడ నగరంలో ఏర్పాటైన కార్పోరేషన్ చలివేంద్రాలలో మధ్యాహ్నం 1గంట వరకు త్రాగునీరు సరఫరా వుండడంలేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తగిన నిర్వహణ లేకపోవడం వలన వాటర్ క్యాన్ లు మధ్యాహ్నం 1గంట వరకు చలివేంద్రాలకు చేరడంలేదన్నారు. ఉదయం 9నుండి సాయంత్రం 4వరకు త్రాగు నీరు అందించే ఏర్పాటు చేస్తేనే బాటసారులకు చలివేంద్రాల ప్రయోజనం వుంటుందని తెలిపారు.
ఈ ఏడాది ప్రజా సంఘాల ఒత్తిడి తట్టుకోలేక మొక్కు బడిగా పెట్టిన చలివేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయ న్నారు. గతంలో ప్రతి నాలుగు రోడ్ల జంక్షన్ల లోనూ విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు కాగా ప్రస్తుతం వాటి ఏర్పాటు నిర్వహణ 25శాతం కూడా లేకుండా నామ మాత్రం చేయడం తగదన్నారు. కార్పోరేషన్ ఆర్థిక మాంద్యం వలన ఏర్పడిన దుస్తితిగా వుందన్నారు.