News Political

కాకినాడ ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు..!

  • కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు

కాకినాడ నగరంలో ప్రజలు క్షణక్షణం భయాందోళనలతో బ్రతకాల్సి వస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక నూకాలమ్మ మన్యం డోర్ నెంబర్ 17-2-59- 95/A2 కు సంబంధించిన స్థలంలో రెడ్డి భాగ్యశ్రీ పేరున 2017 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ల పట్టా అందిస్తే దానిని నేడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేసి కబ్జాకు పాల్పడితే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని. అన్యాయం జరిగింది అని పోర్టు పోలీస్ స్టేషన్ వెడితే బాధితులపై కేసు పెట్టడం జరిగిందని దీని వెనుక కాకినాడ సిటీ ఎమ్మెల్యే హస్తము ఉందని కొండబాబు ఆరోపించారు. తన వార్డులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించిన మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమని అన్నారు. ప్రజల ప్రాణాలకు ఆస్తులకు వైకాపా ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుందని అడుగడుగునా అసాంఘిక శక్తులు ఆగడాలు పెరుగుతున్న పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాసి బాధితులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.