శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో స్వయంభువుకి కవచ థారణ, తిరుమల శ్రీవారి పాదుకల ప్రతిష్ట సందర్భంగా శివకేశవ ఆరాధనతో చేపట్టిన 8 వారాల అన్నసమారాధనను రెండవ సోమవారం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన జరగడం లోక కల్యాణకారకమన్నారు. 108 మంది ముత్తైదువులకు అన్నప్రసాదంతో తాంబూలాలు ప్రదానం చేశారు. సైకత శివలింగం భక్తులను విశేషంగా అలరించింది.
కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…
![Screenshot_20231127_161826](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/Screenshot_20231127_161826.jpg?resize=1080%2C700&ssl=1)