Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో మంచుశివలింగానికి కార్తీకహారతి…

WhatsApp Image 2023-12-04 at 5.00.21 PM

కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో శోభకృత్ కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన మంచు శివలింగానికి శివ సహస్ర నామావళితో మంగళ హారతి అందించారు. స్వయంభువుకి కవచం తిరుమల శ్రీవారిపాదాల ప్రతిష్టాపన సందర్భంగా చేపట్టిన 8వారాల శివ కేశవ సమారాధనలో భాగంగా మూడవ సోమవారం108 మంది ముత్తయిదువులకు అన్నసమారాధన తాంబూలాల ప్రదానం నిర్వహించారు. మంచు శివలింగం భక్తులను విశేషంగా అలరించింది. తొలుతగా గణపతికి 809వ సామూహిక జపయజ్ఞ పారాయణతో మహా నైవేద్య నివేదన చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… కార్తీక ధనుర్మాసాల్లో శివకేశవ ఆరాధన చేయడం సర్వ శుభాలకు మంగళ కరమన్నారు. ధనుర్మాసంలో సముద్రునికి అఖండ హారతి జరుగుతుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది