కాకినాడ రూరల్లో థర్డ్ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా కు వ్యతిరేకంగా మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో జరిగిన అవగాహనా కార్యక్రమానికి ప్రముఖ ముఖ్య అతిథిగా క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది జ్యోతిర్మయి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్.సి.సి. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, నిర్ములనపై ప్రసంగించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ప్లకార్డులు, బ్యానర్లు తో ఎపిఎస్పీ నుండి సర్పవరం జుంక్షన్ మీదగా బోట్ క్లబ్ థర్డ్ గర్ల్స్ బెటాలియన్ వరకు థర్డ్ ఆంధ్రా, 9 ఆంధ్రా,18ఆంధ్రా ఎన్.సి.సి. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కాకినాడ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు…
![kkd](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/kkd-1.jpg?resize=1280%2C605&ssl=1)