కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఆ రోడ్లను భాగుచెయ్యకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పోర్కొన్నారు. ఎన్.టి.ఆర్. బ్రిడ్జిపై ఏర్పడిన గంత్తని ఆయన డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ ఘాటీ మెయిన్ రోడ్, వార్ఫ్ రోడ్, జన్మ భూమి రోడ్, తదితర ప్రాంతాల్లో కూడా వున్నాయని అన్నారు. టూ-టౌన్, సాంబమూర్తి నగర్, జగన్నాధపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల రోడ్లు శిథిలమై పాడైనందున తారు రోడ్ల పునః నిర్మాణం చేపట్టాలన్నారు. రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ అండ్ బి మున్సిపాలిటీ చేపట్టాలని ఆయన కోరారు.
కాకినాడ రహదారులను పునః నిర్మాణం చేయాలి…
![6e0b8c27-9dea-4533-88dd-b24a39640f00](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/6e0b8c27-9dea-4533-88dd-b24a39640f00.jpg?resize=1080%2C593&ssl=1)