కాకినాడలో స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నుండి జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమాలు వచ్చిన అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సంతృప్తికర స్థాయిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తి బాబులు అర్జీదారుల నుండి 41 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతీ అర్జీని క్షుణ్ణంగా విచారించి తగు పరిష్కారాలను అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో చూపాలని ఆదేశించారు.
గడువు దాటిన అర్జీలు లేకుండా ఒకసారి సమర్పించిన అర్జీ మరలా అదే అంశంపై పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీపై సకాలంలో పరిష్కారాలు చూపుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు
కాకినాడ లో జగనన్నకి చెబుదాం కార్యాక్రమం…. -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-
![WhatsApp Image 2023-12-04 at 4.06.46 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-4.06.46-PM.jpeg?resize=1283%2C700&ssl=1)