కాకినాడ లో 20 డివిజన్ మహాలక్ష్మి నగర్ లో మాజీ ప్రధాని వాజ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీ.జే.పీ. పార్టీ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. వాజపేయి చిత్రపటానికి పూల మలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టారన్నారు.
వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారని, కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారని తెలిపారు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారని, కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారన్నారు.