16 ఏళ్ళ అనంతరం కాకినాడ వేదికగా జాతీయ స్దాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 67వ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 బాలురు జాతీయ స్దాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్ జనవరి 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి. భానుమూర్తి వెల్లడించారు.. ఈ సందర్బంగా శుక్రవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం నందు మీడియా సమావేశంలో పలు వివరాలు తెలియ జేశారు. టెక్నికల్ అఫీషియల్స్ 25 మంది, వచ్చిన అఫీషియల్స్ కోచ్ మేనేజర్లకు జేఎన్టీయూ, రంగరాయ మెడికల్ కాలేజ్, కోస్టల్ ఇన్, బెస్ట్ ఇన్, జడ్పీ గెస్ట్ హౌస్, రోడ్లు భవనాల ఆదితి గృహంలో వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.