స్మార్ట్ సిటీలో సెప్టెంబర్7నుండి క్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యారావు పేట దూసర్లపూడివారి వీధిలోని భోగిగణపతి పీఠంలో సీనియర్ పథాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంభాల వెంక టేశ్వరరావు గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు కొక్కిలి గడ్డ గంగరాజు బొలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.
జగన్నాధపురం రెండు వంతెనల నడుమ వార్ఫ్ రోడ్ వినాయక సాగర్ వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేశ నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వర రావు అలియాస్ కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు అలియాస్ నానాజీ, పార్లమెంట్ మెంబర్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.పీ. కమీషనర్ ఆర్.డి.వో. లకు సమితి వినతులను అందించా లని నిర్ణయించింది.