మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో రామచంద్రపురం నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల కే. గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో వేలంపాలెం చివర గణపతి నగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు నీట మునిగి ధాన్యం తడిసిపోయింది. ఘటనా స్తలానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులతో చేరుకొని తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. వాటిని అధికారుల సహాయంతో మిల్లులకు తరలిసంచారు. ఆయన మాట్లాడుతూ… రైతులు ఎటువంటి ఆందోళన పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం తగిన ఆర్ధక సహాయం చేస్తుందని అన్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వీ.ఆర్.వో, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
కాజులూరు మండలన్ని పరిశీలించిన మంత్రి చెల్లుబోయిన…
![WhatsApp Image 2023-12-04 at 1.27.19 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-1.27.19-PM.jpeg?resize=1280%2C700&ssl=1)