News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM

 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద ఇద్దరికి జూనియర్ సహాయకులుగా, ఒకరికి ఆఫీస్ సబార్డీనేట్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే గొప్ప అవకాశం దొరికిందని విధుల్లో బాధ్యత, అంకితభావంతో పనిచేయాలన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఖాళీల సంఖ్య, రోస్టర్, సీనియారిటీ ప్రకారం అభ్యర్థులకు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసురావు, ఇతర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం
News Andhra Pradesh Political

అలముకున్న అంధకారం … వెలగని వీధి లైట్లు

కాకినాడ స్మార్ట్‌ సిటీలో వీధిలైట్లు సైతం వెలగట్లేదని కాకినాడ నగర పాలక సంస్థ లోని పలు ప్రాంతాల వారు వాపోతున్నారు. ఏడు సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేసిన