అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం, కాలేరు గ్రామ దళిత మహిళా సర్పంచ్ దాయం కావేరి పట్ల అధికార పార్టీ నాయకులు వివక్షత చూపడం చర్చానీయాంశంగా మారింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి, పక్కనే ఉండి అధ్యక్షత వహించిన సర్పంచ్ దాయం కావేరి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా అదే వేదిక పై కూర్చున్న వైస్ ప్రెసిడెంట్ ను ప్రసంగించమని, మూడు పదవులు కలిగిన పెత్తందారీ రామకృష్ణ రెడ్డి మైక్ ఇచ్చారు. దీంతో తనను అవమానించడంతో సర్పంచ్ కార్యక్రమాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె వీడియో రూపంలో మీడియాకు తెలియజేశారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశమైంది.