Political

కాషాయ పార్టీ రాడార్‌లో పది లోక్‌సభ స్థానాలు…

OIP (13)

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 10 సీట్లు సాధించి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో నాయకులు, క్యాడర్ ఇప్పటికే సెగ్మెంట్లలో పని చేస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం వారికి గ్రౌండ్ లెవల్ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టడానికి వెళ్లడించింది. జాతీయ నాయకత్వం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రతి వారం సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో 10 రోజుల్లో హైవోల్టేజీ ప్రచారానికి పార్టీ ప్లాన్ చేస్తోంది.

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌ నగర్, జహీరాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలపై పార్టీ పూర్తిగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ అనే నాలుగు స్థానాలను బీ.జే.పీ. గెలుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో కనీసం తొమ్మిది సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.