కులం పేరుతో సమాజాన్ని విభజించి, బుజ్జగించడం ద్వారా తమ ఓటు బ్యాంకును ఏకం చేయాలనే జంట వ్యూహంతో కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల్లో పోరాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ… ఇతర వెనుకబడిన తరగతుల విభాగంలో ముస్లింలకు కోటా ప్రయోజనాలు కల్పించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఫత్వా జారీ చేసిందని అన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ యోచిస్తోందన్నారు. కాంగ్రెస్ రెండు వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని మొదటిది కులం పేరుతో సమాజాన్ని విభజించడం, రెండోది బుజ్జగించడం ద్వారా తమ ఓటు బ్యాంకును ఏకం చేయడం అని మోదీ అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దళితులు, ఆదివాసీలు, ఓ.బీ.సీ. లకు రిజర్వేషన్ల తగ్గింపు గురించి పూర్తి పుకారు వ్యాప్తి చేసి దానిని ఎన్నికల ఎజెండాగా మార్చడానికి ప్రయత్నించిందని ప్రధాని అన్నారు.