కృష్ణా జిల్లాలోని కృతివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చెక్క దుంగలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ను మినీ ట్రక్కు ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఓవర్టేక్ చేస్తుండగా మినీ లారీ కంటైనర్ లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. మచిలీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుభానీ తెలిపిన వివరాల ప్రకారం… ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో బాధితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాద వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ట్రాక్టర్ ను ఢీకొన్న మినీ ట్రక్క్…
![tractorr](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/tractorr.jpg?resize=329%2C184&ssl=1)