Exclusive

కృష్ణ జనార్ధన స్వామి రథోత్సవంలో పాల్గోన్న మంత్రి కుటుంబ సభ్యులు…

WhatsApp Image 2024-02-20 at 9.04.41 PM

నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరంలోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బి.సి. సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పురస్కరించుకుని అనంతరం జనార్ధన స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం రథోత్సవంలో సతి సమేతంగా పాల్గోన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లడూతూ… హిందువులకి అత్యంత పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి అన్నారు. ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకూ తొమ్మిది జనార్ధన స్వామి ఆలయాలు ఉంటే, వాటిలో ప్రథమం ఆలయం ధవళేశ్వరం ఆలయం అన్నారు. ఈ రథోత్సవ కార్యక్రమములో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజలకి మంచి జగరాలని శ్రీ జనార్ధన స్వామిని కోరుకోవడం జరిగిందని మంత్రి తెలియచేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.