కేరళలోని కొట్టాయం జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వారుంటున్న నివాసంలో ఆత్మ హత్య చేసుకుని శవమై కనిపించారు. ఆకలకున్నంకు చెందిన జేసన్ థామస్ తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొట్టాయంలోని పూవరాణి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో కుటుంబం నివసించేది. జేసన్ తన భార్య మెరీనా బెన్నీ మరియు అతని ముగ్గురు పిల్లలు, నాలుగు, రెండు సంవత్సరాల వయస్సు మరియు ఏడు నెలల పాపను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్గా పనిచేస్తున్న జేసన్ మంగళవారం ఉదయం తన అన్నయ్యను తన ఇంటికి రావాలని కోరగా, సోదరుడు ఇంట్లోకి ప్రవేశించగా, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ శవమై కనిపించారు.