కేరళ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా కాంగ్రెస్ (ఎస్) నాయకుడు కదన్నపల్లి రామచంద్రన్, (బి) నాయకుడు కే.బీ. గణేష్ కుమార్ డిసెంబర్ 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. రవాణా మంత్రి ఆంటోని రాజు, ఓడరేవుల మంత్రి అహ్మద్ దేవర్కోవిల్ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. సీ.ఎం. పినరయి విజయన్ను తన అధికారిక నివాసం కలిసి తమ రాజీనామాలను సమర్పించారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పరువు తీసేందుకు గణేష్ కుమార్ ప్రధాన కుట్ర పన్నారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎల్.డి.ఎఫ్. నాయకులను ఆయన కోరారు. యు.డి.ఎఫ్. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని సతీశన్ తెలిపారు.