కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.