అడ్డదారులల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం వైసిపి డ్రామాలు ఆడుతుందని, దీనిలో భాగంగానే ఉత్తరాంధ్రలో కోడికత్తి డ్రామా.. విజయవాడలో గులకరాయి డ్రామాలు ఆడి సానుభూతి కోసం విశ్వయత్నాలు చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. వైసిపి నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందనీ ..అయినా వైసీపీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ జగన్ పై హత్యయత్నం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.