Political

కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని… -బీ.జే.పీ.-

WhatsApp Image 2024-04-14 at 4.59.30 PM

మేమంతా సిద్ధం పేరుతో వైయస్సార్ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి విజయవాడలో ఉండగా రాయి తగిలి ఆయన నుదుటిపై గాయమయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వస్తున్న వార్తలు తదుపరి పరిణామాలు కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని బీ.జే.పీ. పార్టీ సీనియర్ నేత నరసాపురం ఇన్చార్జి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఐ ప్యాక్ ఎన్నికల వ్యూహ కర్తగా పని చేస్తోందని అన్నారు. ఐ ప్యాక్ వారు పనిచేస్తున్న పార్టీ నాయకులకు సానుభూతి సమకూర్చడం కోసం ఇటువంటి డ్రామాలు బాగా రచించి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడ్డారు. అయితే ఒకే డ్రామా అన్నివేళలా పనిచేయదనే విషయాన్ని ఐ ప్యాక్ గుర్తించాలని వారన్నారు.

ఒకవేళ ఆయన పై జరిగిన దాడి నజమయితే ఆ దాడిని ఖండించాల్సిందేనని అయితే ఈ దాడి విషయంలో ఇంత వరకు ఎంతమంది పోలీస్ అధికారులును బాధ్యతలుగా గుర్తించి చర్యలు తీసుకున్నారో చేప్పాలని అన్నారు. జగన్ ప్రయాణిస్తున్న మార్గంలో ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు సైతం నరికి వేయించే పోలీసు యంత్రాంగం ఒక చిన్న రాయి గాయం నుంచి ముఖ్యమంత్రి ని ఎందుకు రక్షించలేకపోయిందని వారు ప్రశ్నించారు. 

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.