డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలో రాజోలు నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వేమా విచ్చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఇందుకుగాను శక్తి కేంద్రాటు, బూతు కమిటీలను సంపూర్ణంగా నిర్మాణం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యాక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్ నగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల సత్యనారాయణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.