కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దేశంలో 89 శాతం కోవిడ్ కేసులు ఈ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి స్పష్టమైన సమాచారం అందించలేదనన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతోందని అయితే దీనిపై స్పష్టమైన ప్రకటనలు విడుదల చేయలేని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలోని 1,800 కంటే ఎక్కువ కేసులుంటే అందులో 1,600 కేసులు కేరళలో నమోదయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని, బహుశా రాష్ట్ర ప్రభుత్వ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నవ కేరళ సదస్సు ముగింపు కోసం వేచి ఉందని సతీషన్ ఆరోపించారు.