కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం ఒక ఆకస్మిక చర్యను రూపొందించింది. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఇన్పేషెంట్ వార్డులోను రెండు పడకలను కేటాయించినట్టు వెళ్లడించింది. ఒక వైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సగటున 3 నుంచి 4 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, అయినా వైరస్ పై పోరాడటానికి నగరం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.